అనాధ పిల్లలకు ఉచిత వైద్యం

21 Dec 2020 Blog

అనాధ పిల్లలకు ఉచిత వైద్యం అందించడం లో మేడిలైఫ్ వైద్యుల ఔదార్యం
త్వరలో మేడిలైఫ్ ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ వర్తింపు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మేడిలైఫ్ ఆసుపత్రిలో అనాథ పిల్లలకు ఉచిత వైద్యం అందిస్తు వారి ఔదర్యాన్ని చాటుకుంటున్నారు వైద్యులు కుమారస్వామి .జిల్లాలలోని అనాథ పిల్లలకు ఏదైనా జబ్బు చేసి ఆసుపత్రిలో చేరితే వారికి ఉచితంగా వైద్యం చేస్తున్నారు .గతంలో చెన్నూర్ పట్టణానికి చెందిన ఒక బాలిక విషజ్వరంతో భాద పడుతూ ఎన్నో మందులు వాడి ,ఆసుపత్రుల చుట్టు తిరిగి నయం కాలేదు .ఆ బాలికను స్ధానికులు కొందరు మేడిలైఫ్ చేర్పించగా వైద్యుడు కుమారస్వామి ఆ బాలికకు ఉచితం వైద్యం చేసి ,బాలికకు పూర్తిగా తగ్గేవరకు ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు చేశారు.ఇదొక్కటే కాదు ఇలా ఎంతో మందికి ఉచిత వైద్యం చేస్తు అందరితో మన్ననలు పొందుతూ ,ఆసుపత్రి కీర్తిని జిల్లాల నలుమూలల వ్యాపింపజేస్తున్నారు .డాక్టర్ కుమార స్వామి ,త్వరలో ఆరోగ్య శ్రీ గుర్తింపు కూడా మేడిలైఫ్ ఆసుపత్రికి రానుంది .ఇక నుండి వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ఈ ఆరోగ్య శ్రీ ద్వారా తమ ఆసుపత్రిలో వైద్యసేవలు అందజేయనున్నట్లు వైద్యుడు కుమారస్వామి తెలిపారు .

Search

+