నీరుపేద కూలికి ఉచిత శాస్త్ర చికిత్స

21 Feb 2021 Blog

మందమరిలోని చేతులాపూర్ కు చెందిన నిరుపేద కూలి మాసూ సమ్మయ్య (42)కు శ్రీ విద్య ఫౌండేషన్ ఆద్వర్యంలో  ఉచిత శస్త్ర చికిత్స నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన శ్రీ విద్య ఫౌండేషన్ ఆద్వర్యంలో ఈ నెల 11 న సీఈఓ డాక్టర్ దాసా రాపు శ్రీనివాస్ చటులాపూర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సమ్మయ్య దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ పలు హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్నాడు. ఆర్థిక ఇబందుల తో అనారోగ్యం తో ఇంట్లోనే ఉంటున్నాడు. శ్రీ విద్య ఫౌండేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో సమయ పరిస్దితిని డాక్టర్ శ్రీనివాస్ తెలుసుకున్నారు. మంచిర్యాల లోని మేడి లైఫ్ హాస్పిటల సమ్మయ్య కు ఉచిత శస్త్ర చికిత్స నిర్వహిస్తానని, అందుకు సహకరించాలని యాజమాన్యాన్ని కోరడంతో వారు అంగీకరించారు. దీనితో మేడిలైఫ్ ఆసుపత్రి వైద్యుల సహకారంతో డాక్టర్ శ్రీనివాస్ సోమవారం రాత్రి ఆపరేషన్ చేసి రాళ్లను తొలగించారు. పిత్తాశయం తీసివేశారు. ఉచితంగా ఆపరేషన్ చేసి మానవత్వాన్ని చాటిన శ్రీ విద్య ఫౌండేషన్ కు , సహకరించిన మేడిలైఫ్ హాస్పిటల్ కు సమ్మయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మేడిలైఫ్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వంశీ, డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ కుమారస్వామి,సిబ్బంది ఉపేందర్ , సురేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Search

+